విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని పోతుకుంట పంచాయతీలోని బృందావనం కాలనీకి చెందిన పవన్ కుమార్ (వయస్సు 25) మద్యానికి బానిసై, అప్పులు చేసి, ఆ అప్పులు తీర్చలేక ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన పవన్ కుమార్ జల్సా లకు అలవాటు పడి మధ్యానికి పూర్తిగా బానిస కావడం జరిగింది. తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురై, ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి ఇంక ను పెళ్లి కాలేదు. ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవాడు. కానీ మద్యం బానిస కావడం, అప్పులు తీర్చలేక పోవడంతో, క్షణికమైన ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబాన్ని ఎంతగానో బాధించింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.