విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు 68వ జన్మదిన వేడుకలు సందర్భంగా రోగులకు బ్రెడ్లను పంపిణీ చేశారు. తొలుత కాలేజీ సర్కిల్ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద విగ్రహానికి పూలమాలవేసి, తదుపరి కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బీసీ కులాలు అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని జిల్లా అధ్యక్షులు నామాల శంకర్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో బీసీ కులస్తులకు న్యాయం జరిగేలా అనేక పోరాటాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిర్రాజు రవి, బోయ రవిచంద్ర, అధిక సంఖ్యలో బీసీ నాయకులు పాల్గొన్నారు.