ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : జిల్లాలో రానున్న రోజులలో భారీ వర్షాలు పడే ఆవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసిందని, కావున ప్రజలందరూ నీటి ప్రవాహముల దగ్గరగా ఉన్నపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అనంతపురం కలెక్టరేట్ లో జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 8500292992, 08554-220009 ను ఏర్పాటు చేశామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వర్షాల వేళ ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో పిడుగుపాటుకు ఆవకాశం ఉంటుందని, కావున చెట్లు కింద, చెట్ల సమీపములో, టవర్స్ దగ్గర ఉండరాదన్నారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ఎలక్ట్రికల్,ఎలెక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని, విద్యుత్ తీగలకు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.