జిల్లా వనరుల కేంద్రం ఏ డి ఏ సనావుల్ల
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి రైతు తన పొలంలో ప్రత్యామ్నాయ పంటలు పండించి ఖచ్చితమైన అధిక దిగుబడులు సాధించవచ్చు అని జిల్లా వనరుల కేంద్రం ఏ డి ఏ సనావుల్లా, సహాయ వ్యవసాయ సంచాలకులు, ధర్మవరం కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని తుమ్మల రైతు సేవ కేంద్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమములో రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ వేరుశెనగకు ప్రత్యామ్నాయంగా కంది, ఆముదము, రాగి, పప్పు దినుసులు సాగు చేసుకోవాలని తెలిపారు. పంట సాగులోని మెలుకువలను మేలైన సాగు పద్ధతులను పాటించడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చునని వారు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకత, భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా సమతూల్యమైన ఎరువులను వాడడం, నానో యూరియా, డిఏపిలు వాడకం డ్రోన్ల ద్వారా సస్యరక్షణ, మందుల పిచికారి చేయడం, వాటి ఉపయోగాలు గురించి రైతులకు పూర్తి వివరణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. సాగు చేసిన కంది పంట పొలాలను కూడా వారు పరిశీలించారు అధిక దిగుబడును సాధించడానికి ఎకరాకు 12000 మొక్కల సాంద్రత ఉండాలని, దీనికోసం సాలుకు సాలుకు మధ్య ఆరడుగులు, ఒక సాలులో మొక్కల మధ్య ఒక అడుగు దూరం ఉండాలని వారు సూచించారు. కందిలో రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఎకరాకు ఒక లీటర్ వేప నూనె పిచికారి చేసుకోవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముస్తఫా, రైతు వనరుల కేంద్రం ఏవో అబ్దుల్ అలీ, గ్రామ వ్యవసాయ సహాయకురాలు దివ్య, గ్రామ రైతులు పాల్గొన్నారు.