శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఈనెల 28వ తేదీ ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు బంధనాథం వెంకటరమణ, కార్యదర్శి రాధాకృష్ణ, కోశాధికారి దాసరి వెంకటేశులు(చిట్టి), గౌరవ అధ్యక్షులు గడ్డం పార్థసారథి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు మంగమ్మ, కీర్తిశేషులు మామిళ్ల రంగప్పల జ్ఞాపకార్థం వీరి కుమారుడు మామిళ్ల విజయలక్ష్మి మామిళ్ళ శేషప్పలు వ్యవహరించనున్నారని తెలిపారు. అనుభవజ్ఞులైన డాక్టర్ వివేకుళ్లయప్ప, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సాయి స్వరూప్, డాక్టర్ ఎం. సుబ్రహ్మణ్యముల చేత రోగులకు అన్ని రకాల వైద్య చికిత్సలను అందించబడునని తెలిపారు. వైద్య చికిత్సల అనంతరం ఒక నెలకు సరిపడు. మందులను ఉచితంగా అందించబడునని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని, ఆరోగ్యమును పదిలం చేసుకోవాలని తెలిపారు.