భారత ప్రభుత్వ చర్యలు ఆమోదయోగ్యం కాదని కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో సోమవారం వ్యాఖ్యానించారు. భారత్ ప్రాథమిక తప్పిదానికి పాల్పడిందని ఆరోపించారు. కెనడాలోని భారత్ దౌత్యవేత్తను వెనక్కి పిలిపించిన భారత్, ఢిల్లీలోని కెనడాకు చెందిన ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజ్జర్ హత్య కేసులో ాఆసక్తి ఉన్న వ్యక్తులు్ణ (అనుమానితులు)గా భారత హైకమిషనర్ సంజరు కుమార్ వర్మ, ఇతర దౌత్యవేత్తలను విచారించనున్నట్లు ప్రకటించిన అనంతరం భారత్ ఈ చర్య తీసుకుంది. కెనడా వ్యాఖ్యలను ాఅసంబద్ధమైన ఆరోపణలు్ణగా భారత విదేశీ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. కెనడాలో దేశీయంగా ట్రూడో ప్రభుత్వం ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లతో ఈ విషయం ముడిపడి ఉందని పేర్కొంది.
ఈ ఏడాది జూన్లో జరిగిన జి-7 సదస్సు సందర్భంగా నిజ్జార్ హత్య వెనక భారత్ పాత్ర ఉందని ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య వివాదం మొదలైన సంగతి తెలిసిందే.