విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : చోడవరం లో స్థానిక స్వయం భూ వినాయక దేవస్థానం ఆవరణలో సద్భావ టీం ఏర్పాటు చేసిన ” కమ్యూనిటీ ఫ్రిడ్జ్” ద్వారా ఆంధ్రప్రభ పత్రిక ప్రతినిధి, చోడవరం సర్కిల్ ఇన్చార్జి దొడ్డి వెంకట ముత్యాలు నాయుడు (వెంకటేష్) దంపతులు ఆర్థిక సహకారంతో గురువారం పేదలకు భోజనాలు వితరణ చేశారు. అన్ని దానాల్లోకి అన్నదానం మహా భాగ్యమని నాయుడు తెలియజేసారు. సాధారణంగా తమచే విజయరామరాజు పేటలో ప్రతిష్టింపబడిన షిర్డీ సాయి ఆలయంలో పలు సేవా కార్యక్రమాలు చేపడతామని, కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ద్వారా ఆహారం వితరణ చేసే అవకాశం వుండటంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సి.డి.వి.ఎం. కమ్యూనిటీ ఫౌండేషన్ అడ్మిన్ కొప్పాక రాజేష్, వినాయకుని గుడి ప్రధాన అర్చకులు కొడమంచలి చలపతిరావు, పసుమర్తి శ్రీనివాసరావు (బ్రూక్ బాండ్ శ్రీను), ఉప్పల రజని, సద్భావ టీం సభ్యులు పాల్గొన్నారు.