ఏఐవైఎఫ్ ఏపీ వాలంటరీ అసోసియేషన్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు వినతులు
విశాలాంధ్ర- అనంతపురం : రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు ఏపీ వాలంటరీ అసోసియేషన్ అనుబంధ ఏఐవైఎఫ్ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ వాలంటరీ అసోసియేషన్ ఏఐవైఎఫ్ అనుబంధ సంఘం జిల్లా కన్వీనర్ సంతోష్ కుమార్ కో కన్వీనర్ ఆనంద్ కుమార్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి వీధుల్లో కొనసాగించాలని ఎన్నికల హామీ ప్రకారం వాలంటీర్లకు పదివేల గౌరవ వేతనం ఇవ్వాలి, బకాయి పడ్డ 4 నెలల గౌరవ వేతనాన్ని తక్షణమే చెల్లించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో గత 5 సంవత్సరాలు ప్రభుత్వ సంక్షేమ పధాకాలు. ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వానికి, ప్రజల మధ్య వారధిలా వాలంటీర్స్ కీలకంగా వ్యవహరించడం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో వాలంటీర్లను కోనసాగిస్తాం.10వేల రూపాయిలు గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల లో హామి ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎర్పడి 100 రోజులు గడుస్తున్న నేటికి వాలంటీర్లకు సమస్య పరిష్కారం కోసం చర్చించలేదు. ఇప్పటి వరకు ఏడు సార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించినా 2.60 లక్షల మంది వాలంటీర్ల భవిష్యత్ ఎమిటి అంటే ప్రభుత్వ పెద్దల నుండి స్పందనలేని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.60లక్షల వాలంటీర్స్కి న్యాయం చేయాలని,ఆఖిల భారత యువజన సమాఖ్య( ఏఐవైఎఫ్ ) అనుబంధ సంఘంగా ఁఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోషియేషన్ ను ఎర్పాటు చేసుకొవడంతో పాటు ఇప్పటికి పలుమార్లు రాష్ట్ర మంత్రులు నారాలోకేష్, డోలా బాల వీరాంజనేయస్వామి, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, కోలుసు పార్ధసారది, ఆనం రామనారాయణరెడ్డి, కింజారపు అచ్చంనాయుడు తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ళీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, డిప్యూటి కలెక్టర్లు, ఆర్ డి ఓ , ఎం ఆర్ ఓ ఎంపీడీఓ లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ గురించి ప్రభుత్వం ఎన్నికల హమీ నెరవేరుస్తామని ప్రకటించారన్నారు . క్రెడికే పరిమితం కాకుండా ఈసారి జరిగే క్యాబినెట్ సమావేశంలో ఏపీ వాలంటరీ గురించి స్పష్టమైన తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య,ఏపీ వాలంటరీ అసోసియేషన్, వాలంటీర్స్ గా ప్రభుత్వనీకి మావిజ్ఞప్తి తెలిచేయలిని జిల్లా కలెక్టర్ ని కోరడం జరిగిందన్నారు. ఈ వాలంటరీలు కరణ వెంకటేష్ ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు పాల్గొన్నారు..