కార్యాలయం నందు దళారులదే రాజ్యం
మీడియాలో హల్చల్ చేస్తున్నను సామాన్యులకు దక్కని న్యాయం
విశాలాంధ్ర చిలమత్తూర్ రూరల్ (శ్రీ సత్యసాయి జిల్లా) : చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ , జిల్లా సమితి సభ్యుడు గోవింద్ రెడ్డి మాట్లాడుతూ చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు పైసలు ఇవ్వనిదే పని జరగదు అంటూ సామాన్యులకు నేరుగా కార్యాలయంలో వెళ్లి అడిగితే కొంతమంది సిబ్బంది డాక్యుమెంట్ రైటర్లా దగ్గరకు పంపిస్తున్నారని దళారుల ద్వారా మాత్రమే పని జరుగుతుందని ప్రజలు నేరుగా వెళితే పని జరగదని సోమందేపల్లి కి చెందిన ప్రసాద్ తన పని కోసం 20 రోజుల నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ తన పని మధ్యవర్తులను కలిస్తేనే జరుగుతుందని సబ్ రిజిస్టర్ లోని సిబ్బంది అలా చెప్పారని, సబ్ రిజిస్టర్ ముందరరే ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల పైన సొదాలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు, అవినీతికి హద్దు అదుపు లేకుండా యదేచ్చగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యుల పని జరగటం లేదని సామాన్యులకు సైతం న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి నాగిరెడ్డి, రైతుసంఘం నాయకులు వెంకటేషప్ప,నాయకులు సమీవుల్లా, జియ, నౌషాద్, రామంజప్ప, గౌస్, చాంద్ భాషా, తదితరులు పాల్గొన్నారు.