ఇరాన్పై ఇజ్రాయిల్ మరోసారి దాడి చేసింది.శనివారం ఉదయం రాజధాని టెహ్రాన్లో ఇరాన్ సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ పేర్కొంది. టెహ్రాన్ పరిసరాల్లో పలు పేలుళ్లు సంభవించాయి. గాజా, లెబనాన్పై పదకొండు నెలలకు పైగా ఇజ్రాయిల్ మానవ హక్కుల ఉల్లంఘనలకు ప్రతిస్పందనగా అక్టోబరు 1న ఇరాన్ ఇజ్రాయిల్పై సుమారు 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ ఈ దాడి చేసింది. ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయిల్ రహస్య పత్రాలు ముందుగానే బయటపడ్డాయి. ఈ పత్రాలు అమెరికా గూఢచార సంస్థ చేతికి చిక్కాయి. అసోసియేటెడ్ ప్రెస్ ఇజ్రాయెల్తో పాటు, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ మరియు యుకె వంటి మిత్రదేశాలకు కూడా పత్రాలపై అవగాహన ఉందని నివేదించింది.