అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్న పీసీసీ సభ్యుడు సూరిబాబు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు సీటు కేటాయించాలని కోరుతూ విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ లో బోడేంగి కృష్ణకుమారి దంపతులను కలసి దరఖాస్తు సమర్పించడం జరిగిందని యువజన కాంగ్రెస్ అల్లూరి జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడైన కొర్రా సూరిబాబు బుధవారం తెలిపారు. పి వి టి జి వర్గానికి చెందిన తాను ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నానన్నారు. తన సేవలను గుర్తించిన అధిష్టానం తనను ప్రవేశ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగాను, యువజన కాంగ్రెస్ అల్లూరి జిల్లా ఉపాధ్యక్షుడిగాను పదవులు ఇచ్చి గౌరవించిందన్నారు. రాబోవు సార్వత్రిక ఎన్నికలలో అధిష్టానం తనకు అరకు పార్లమెంట్ స్థానం నుంచి అవకాశం కల్పిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కనుక తన దరఖాస్తును పరిశీలించాలని ఆయన తన దరఖాస్తులో కోరారు