విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- చింతపల్లిలో నేటి నుంచి మూడు రోజులపాటు సువార్త స్వస్థత మహాసభలు జరగనున్నాయి. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ లో ఫిబ్రవరి 1 .2 .3 తేదీలలో గురు, శుక్ర, శనివారాలలో నిర్వహించు సువార్త స్వస్థత మహాసభలు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమగును. దైవ వర్తమానికులు రవి అబ్రహం (వకీల్) ఉత్తర భారతదేశం ఆఫ్రికా ప్రాంత పరిచర్యలు ఈయన అనేక దేశాలలో ప్రార్థనల ద్వారా ఏసుక్రీస్తు పేరిట అనేక రోగాలనుండి విడుదల కలుగుచున్నవని, రోగ పీడత వేదన బాధలు, కుటుంబ సమస్యల కొరకు నిత్యము దైవజనులు రవి అబ్రహం ప్రార్థిస్తున్నారని, ఏసుక్రీస్తు పేరిట వేలాదిగ రోగులు స్వస్థపరచబడుటకు మీరు విశ్వాసంతో రండని రక్షణ స్వస్థత ఆశీర్వాదం పొందండని ప్రచారం ద్వారా తెలియపరుస్తున్నారు. మూడవ తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యూత్ ఫైయర్ కాన్ఫరెన్స్
నిర్వహించ బడునని, చింతపల్లి. గూడెం .జి మాడుగుల మండలాలకు చెందిన పాస్టర్స్, పెద్దలు, విశ్వాసులు విచ్చేసే ఈ సువార్త స్వస్థత మహాసభలలో వేలాదిగా పాల్గొని దైవ వర్తమానికులు రవి అబ్రహం ప్రార్థనలు వినడమే కాకుండా రక్షణ స్వస్థత ఆశీర్వాదం పొందాలని స్థానిక దైవజనులు కోరారు.