Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎంపీటీసీ జయలక్ష్మి కి పతి వియోగం

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- స్థానిక ఎంపీటీసీ చిందాడ జయలక్ష్మి కి పతి వియోగం కలిగింది. స్థానిక తపాలా శాఖలో పోస్ట్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్న ఆమె భర్త సత్యనారాయణ మంగళవారం విధులకు వెళుతున్న క్రమంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన వైద్య సేవల నిమిత్తం హుటాహుటిన విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. సత్యనారాయణ పార్థివదేహాన్ని స్వస్థలమైన చింతపల్లి అంబేద్కర్ కాలనీకి గురువారం తెల్లవారుజామున తీసుకొచ్చారు. సత్యనారాయణ మృతితో అంబేద్కర్ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. సత్యనారాయణ పార్థీవదేహానికి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పాడేరు నియోజకవర్గం అభ్యర్థి విశ్వేశ్వర రాజు లు స్థానిక ప్రజాప్రతినిధులు వైకాపా నాయకులతో కలిసి సందర్శించి పార్థివ దేహానికి నివాళులు అర్పించడంతోపాటు, ఆ కుటుంబానిక ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇదే క్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, సత్యనారాయణ అభిమానులు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img