Friday, May 17, 2024
Friday, May 17, 2024

ప్రచారంలో దూసుకుపోతున్న భారత్ కూటమి అభ్యర్ధి జగతా శ్రీనివాస్ ….

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో భారత్ కూటమి చోడవరం ఎమ్మెల్యే అభ్యర్ధి జగతా శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. చోడవరం ఆర్టీసి కాంప్లెక్స్, మెయిన్ రోడ్, బజారు వీధి, కోటవీధి తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచే ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సి.పి.ఐ జిల్లా సమితి సభ్యుడు రెడ్డిపల్లి అప్పల రాజు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల జీవన స్వేచ్చ కు భంగం కలిగించే భూ హక్కుల చట్టం (లాండ్ టిట్లింగ్ యాక్టు) చేసిన బూర్జువా రాజకీయ పార్టీలు బి.జె.పి., వై.సి.పి. లను ఓటు హక్కు అనే వజ్రాయుధంతో తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కుల, మతాల ముసుగులో ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. ప్రజల ఆస్తులను “గోవిందా” అనిపించే వారికి ఓటేస్తే భవిష్యత్తులో ప్రజలకు “గోవిందా” అనే మాట తప్ప ఏమీ మిగలదన్నారు. ఇవి ప్రజల భవిష్యత్తును నిర్ణయించే గొప్ప ఎన్నికలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు, బానిస సంకెళ్లు నుండి అఖండ భారతావని ని కాపాడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇచ్చి, బలపరచిన చోడవరం ఎమ్మెల్యే అభ్యర్ధి జగతా శ్రీనివాస్ కు ఓటేసి, ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించాల్సినదిగా ప్రజలను వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సి.పి.ఐ. అనుబంధ ప్రజా మహిళా సంఘాలు పాల్గొన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img