Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

చోడవరం శాసనసభ స్థానానికి ఎన్నికల బరిలో ఆరుగురు అభ్యర్ధులు పోటీ

రిటర్నింగ్ అధికారి, అనకాపల్లి ఆర్డీఓ ఏ.జి.చిన్నికృష్ణ

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : చోడవరం శాసనసభ స్థానానికి ఎన్నికల బరిలో ఆరుగురు అభ్యర్ధులు పోటీలో నిలిచినట్లు రిటర్నింగ్ అధికారి, అనకాపల్లి ఆర్డీఓ ఏ.జి.చిన్నికృష్ణ మీడియాకు తెలిపారు. ఎన్నికల రేసులో వున్న వారిలో 1.కరణం ధర్మ శ్రీ – సీలింగ్ ఫ్యాన్ గుర్తు – యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వై.ఎస్సార్.) పార్టీ., 2. జగతా శ్రీనివాసరావు – హస్తం గుర్తు – ఇండియన్ నేషనల్ కాంగ్రెస్., 3. వేగి మహాలక్ష్మి నాయుడు – ఏనుగు గుర్తు – బహుజన్ సమాజ్ పార్టీ., 4.కలిదిండి సూర్య నాగ సన్యాసి రాజు – సైకిల్ గుర్తు – తెలుగుదేశం పార్టీ., 5. సవరాల గణేష్ – 3 నక్షత్రాలు గుర్తు కలిగిన ఎర్ర జెండా – సి.పి.ఐ (మార్క్సిస్టు – లేననిస్ట్), లిబరేషన్ పార్టీ., 6.పేరిచర్ల వివేక్ రాజు – బకెట్ గుర్తు – ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్నారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img