విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజును అన్నవరం వెంకయ్య గారి పేట విశాఖ డెయిరీ పాల సంఘానికి నూతనంగా ఎన్నికై న పాలకవర్గం సోమవారం ఉదయం ఘనంగా సత్కరించారు. నూతనంగా ఎన్నికైన పాలు సంఘం అధ్యక్షుడు గొన్నబత్తుల కొండబాబు, డైరెక్టర్లుగా ఎన్నికైన పొట్నూరు నారాయణరావు, గూటాల సత్తిబాబు ను అభినందించడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న డైరెక్టర్లు గొన్న బత్తుల రమణ, నేమాల అర్జునమ్మ, పొట్నూరు పెదరాము, గుమ్మాల ఆనందరావు, సీతిని తాతబాబులకు సలహాలు సూచనలు ఇచ్చి అభినందించారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ కె ఎస్ ఎన్ ఎస్ రాజు గారు చేతులు మీదగా పాలు మెంబర్స్ కి ప్రెసిడెంట్ గొన్నబత్తుల కొండబాబు సొంత నిధులతో వ్యవసాయానికి ఉపయోగపడే పెద్ద గిన్నెలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నవరం మాజీ వార్డ్ మెంబర్ ఎర్రంశెట్టి అప్పారావు (అన్నవరం చిన్న), సంఘం సభ్యులు, పాడి రైతులు, టిడిపి సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.