విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ శివరామిరెడ్డి కాలనీలో నెలకొన్న నీటి సమస్యను వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున పరిష్కరించారు. విద్యుత్ మోటార్ చెడిపోయి గత అనేక రోజులుగా నీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఆ కాలనీ ప్రజలు సమస్యను వార్డు సభ్యులుకు తెలపడంతో ఆయన కూడా గ్రామ సర్పంచ్ మరియు కార్యదర్శి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించి మోటార్ రిపేర్ చేయడంతో గురువారం నీటి సమస్య పరిష్కారం అయింది. అదేవిధంగా శివరామిరెడ్డి, చిట్టా కాలనీలో వార్డ్ సభ్యులు మల్లికార్జున వీధిలైట్లు కూడా ఏర్పాటు చేయించారు. సమస్యలు పరిష్కారం కావడంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.