విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండలో గురువారం 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయాల ఆవశ్యకత సమాజంలో వాటి పాత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు స్థానిక గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ మరియు గ్రంథాలయ అధికారిని అరుణ జ్యోతి పాల్గొని గ్రంథాలయాల ఆవశ్యకత గ్రంధాలయాలు ఏర్పాటుకు కృషి చేసిన నాయకులు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు సమాజానికి గ్రంథాలయాలు యొక్క అవసరమెంత మొదలగు అంశాలపై వివరించారు ఫిజిక్స్ లెక్చరర్స్ డాక్టర్ కె చంద్రశేఖర్ రెడ్డి మరియు డాక్టర్ కేఎం రాజేష్ రిటైర్డ్ హెడ్మాస్టర్ ఖాజా హుస్సేన్ విద్యార్థినీ విద్యార్థులకు గ్రంథాలయాల గురించి తన అనుభవాలను వివరించారు ఈ సమావేశంలో గ్రంథాలయ అధికారి ప్రతాపరెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.