గ్రంథాలయ అధికారి ప్రతాప్ రెడ్డి
విశాలాంధ్ర`ఉరవకొండ : 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు లో భాగంగా శుక్రవారం ఉరవకొండ గ్రంధాలయం శాఖ అద్వర్యం లో స్థానిక సెంట్రల్ ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు స్థానిక పాఠశాలలో వివిధ అంశాలపై పోటీ పరీక్షలను నిర్వహించడం జరిగిందని గ్రంధాలయ శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఇలాంటి వేదికలను అవకాశం గా తీసుకొని వారికి ఉన్న ప్రతిభను వెలికి తీయాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.