విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని గ్రామాల పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యమని ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి తెలిపారు. స్వచ్ఛభారత్ ద్వారా మంజూరైన రిక్షాలను రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమం అమలు చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లోని చెత్తను రిక్షాల ద్వారా సేకరించి, చెత్త నుంచి సంపద కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఇందులో ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్, ఈఓఆర్డీ ఎస్.మాధవి, వైసీపీ యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్తిరెడ్డి, మరూరు ఆది, సర్పంచులు సాకే తిరుపాలు, శశికళ, ఎంపీటీసీ రాముడు తదితరులు పాల్గొన్నారు.