Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత

విశాలాంధ్ర-రాప్తాడు : డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రూపొందించిన భారత రాజ్యాంగానికి లోబడి అందరూ నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీడీఓ సాల్మన్‌ తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మితో కలిసి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పాటు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన స్వతంత్ర భారత దేశంలో అన్ని వర్గాలు స్వేచ్ఛాయుతంగా జీవిస్తున్నారంటే అందుకు అంబేద్కర్‌ మహనీయుడు రూపొందించిన రాజ్యాంగమే కారణమన్నారు. దేశం లౌకిక దేశంగా అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి మెలసి జీవించగలుగుతున్నారంటే అది అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం వల్లనే అని చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఏఓ రత్నాబాయి, ఈఓఆర్డీ మాధవి, పీఆర్‌ ఏఈ ఓబులదాస్‌, ఏపీఓ రామకృష్ణారెడ్డి, ఎపీఎం శివకుమార్‌ రెడ్డి, వైసీపీ యూత్‌ కన్వీనర్‌ చిట్రెడ్డి సత్తిరెడ్డి, ప్రసన్నాయపల్లి సర్పంచ్‌ శశికళ, పంచాయతీ కార్యదర్శి కల్పన తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img