విశాలాంధ్ర`ధర్మవరం: జనసేన పార్టీ అభివృద్ధికి పార్టీ కార్యకర్తలు కృషి చేసినప్పుడే విజయం చేకూరుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిలకం స్వగృహంలో పట్టణంలోని 32వ వార్డు దుర్గా నగర్ కు చెందిన పది కుటుంబాల సభ్యులు జనసేన పార్టీలో చేరారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి పార్టీ కండువా వేసి ఘనంగా ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరిన వారిలో సే క్షాహీద్, రామాంజి, సాకే చంద్ర ,కంసాల శేషు, కంశాల ప్రవీణ్, మల్లెల వెంకటేశు, వేల్పుమడుగు సూర్యనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పనిచేసే మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, అన్నివేళలా మీకు నా అండ దండలు ఉంటాయని, కార్యకర్తలకు కష్టమొస్తే తాను తప్పక ఆదుకుంటానని తెలిపారు.