విశాలాంధ్ర – ఉరవకొండ : పిడిఎఫ్ తరపున పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిలు గా పోతుల నాగరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నర్సింహారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నందున మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుతూ గురువారం ఉరవకొండ పట్టణంలో ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయులనూ మరియు పట్టభద్రులను కలిసి ప్రజా సంఘాల నాయకులు ప్రచారం చేపట్టారు. శాసన మండలి లో హక్కుల కోసం పోరాడే వ్యక్తులను ప్రజావాణిని వినిపించే వారిని గెలిపించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీల తోనే సమస్యలు పరిష్కారం అవుతాయని వారు పేర్కొన్నారు. నిరుద్యోగులు సమస్యల పైన, సిపిఎస్ రద్దు పై పోరాటాలు చేసి పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ.కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి కురుగుంట మనోహర్, ఏఐవైఎఫ్ ఉరవకొండ తాలూకా మాజీ అధ్యక్షులు తలారి మల్లికార్జున, విద్యార్థి సంఘ నాయకులు చిరంజీవి, ప్రమోద్, అశోక్,కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.