విశాలాంధ్ర`కదిరి : తాలుకా పరిధిలో ఉన్న పేదలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే నా కర్తవ్యమని డాక్టర్ టిఎస్ మహమ్మద్ ముస్తఫా పేర్కొన్నారు.సోమవారం స్థానిక పశువుల ఆసుపత్రి సమీపాన ఏ ఫ్యామిలీ కేర్ ప్రవేట్ ఆసుపత్రిని ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డితో కలిసి ప్రారంభించిన అనంతరం డాక్టర్ మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ఈ ప్రాంత పేదలకు వైద్య సేవలు అందించలన్న సదుద్దేశంతో పట్టణ నడబొడ్డున ఆసుపత్రిని ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాధాభాయ్,ఎంపిపి అమరనాథ రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు