మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి
విశాలాంధ్ర`ఉరవకొండ : ఈనెల 7వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం లో జరిగే జయహో బిసి మహాసభను జయప్రదం చేయాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి బిసి నాయకులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీ కులాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు.గతంలో ఎన్నడు లేని విధంగా వివిధ సంక్షేమ పథకాలు ద్వారా బీసీ కులాలకు 1.77 లక్షల కోట్ల రూపాయలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కింది అన్నారు. బీసీలకు అత్యధిక శాతం నామినేటెడ్ పదవులు ఇచ్చి వారి గౌరవాన్ని పెంచడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ డైరెక్టర్లు ఆ పార్టీ బీసీ నాయకులు పాల్గొన్నారు.