విశాలాంధ్ర- పెనుకొండ : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో గురువారం నాటికి 69 వరోజులుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, యువగళం పాదయాత్రలో పాల్గొని ఉమ్మడి కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గశీ లోకి పాదయాత్ర ప్రవేశించగా తాడిపత్రి నియోజకవర్గ సరిహద్దుల్లో జిల్లా నాయకుల తో కలసి వీడ్కోలు పలికిన తెలుగుదేశం పార్టీ రాష్టకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఉమ్మడి అనంతపురం జిల్లా యువ నాయకులు నారా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న దృశ్యాలు ఆకట్టుకున్నాయి జేసీ అస్మిత్ రెడ్డి, పరిటాల శ్రీరామ్, సవిత, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు . జెసి ప్రభాకర్ రెడ్డి తో కలిసి రాజకీయ అంశాలు చర్చించి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయవలసిందిగా ప్రభాకర్ రెడ్డి తెలిపినట్లు సవిత తెలిపారు ఆమెతో పాటుగా వెంకటేశ్వరరావు పెనుకొండ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు ఆమెతోపాటుగా పాల్గొన్నారు.