విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న సీసీ రోడ్లను పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఉండే విధంగా కాంట్రాక్టర్లు, అధికారులు నిర్మించాలని ఉరవకొండ సర్పంచ్ మీనుగా లలిత, ఎంపీపీ చంద్రమ్మ, జడ్పిటిసి సభ్యురాలు పార్వతమ్మ తెలిపారు. శుక్రవారం పట్టణంలో జరుగుతున్న రోడ్డు పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద పట్టణంలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని అందులో భాగంగా శివరామిరెడ్డి కాలనీలో కోటి రూపాయలు, ఎస్ఎల్ఎన్, డ్రైవర్స్ కాలనీలో మరో కోటి రూపాయలు మాస్టర్ సివివి నగర్ లో 70 లక్షల రూపాయలు నిధులతో పనులు పూర్తి కావడం జరిగిందని వీరశైవ నగర్ లో దాదాపు 70 లక్షల రూపాయలు తో రోడ్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు వీటితోపాటు పట్టణంలోని అనేక వార్డులలో కూడా రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు పట్టణాభివృద్ధికి ఐదు కోట్లు మంజూరు చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి మంజూరు కు కృషిచేసిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు బసవరాజు, మాజీ జెడ్పిటిసి సభ్యులు తిప్పయ్య, ఉప సర్పంచ్ వన్నప్ప, వార్డు సభ్యులు ప్రభాకర్, వైసిపి నాయకులు ఓబన్న, అంజి నేయులు, విశ్వనాథ్ , రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.