Friday, April 26, 2024
Friday, April 26, 2024

అక్రమ మద్యం బాటిళ్ళను ధ్వంసం చేసిన వన్ టౌన్ పోలీసులు


విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల 11 కేసుల్లో పట్టుబడిన 44 లీటర్లు గల 236 బాటిళ్ళను గురువారం గొల్లపల్లి వంక దగ్గర జెసిబి తో పట్టణ సీఐ. సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ సిఐ.. వహీద్ భాష,సెబ్బు సీఐ.. లక్ష్మి దుర్గయ్యల ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సిఐలు మాట్లాడుతూ అక్రమ మద్యం రవాణా, అక్రమ మద్యం అమ్మకాలు, అక్రమ మద్యం.. ఈ మూడు చట్టరీత్యా నేరమని వారు తెలిపారు. చట్ట ప్రకారం మాత్రమే మద్యం విక్రయించాలని, నిర్దేశించిన ప్రాంతాలలో మాత్రమే మద్యం సేవించాలని తెలిపారు. ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని వారు ప్రజల సహకారం ఉంటే, శాంతి భద్రతలకు కొదవలేదని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వన్టౌన్ సిబ్బంది, సెబ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img