Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

అదనంగా ఇళ్ళు మంజూరు చెయ్యండి

గృహ నిర్మాణ శాఖామంత్రికి విజ్ఞప్తి
విశాలాంధ్ర`ఉరవకొండ: పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం అనంతపురం జిల్లాకి వచ్చిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ను ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కలిసారు.ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలు ఆయనకు విన్నవించారు. ప్రస్తుతం మంజూరైన 26 వేల ఇళ్లతో పాటు మరో 2500 నూతన ఇళ్ళు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరారు.దీనిపై స్పందించిన మంత్రి వెంటనే మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img