Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై అనవసర వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్

విశాలాంధ్ర-రాప్తాడు : నియోజకవర్గాన్ని ఏ కోశానా అభివృద్ధి చేయకపోవడంతోనే నిన్ను గత ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారని, మా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదని, అనవసర వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అని టీడీపీ అధికార ప్రతినిధి పరిటాల శ్రీరాంను రాప్తాడు వైసీపీ నాయకులు హెచ్చరించారు. రెండు రోజుల క్రితం ఆత్మకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో నేను అప్పుడప్పుడు చూస్తుంటేనే తట్టుకోలేకపోతున్నావ్.. ఇక మూడు కళ్లు తెరిస్తే తట్టుకోలేవ్ అంటూ హెచ్చరించడంపై శుక్రవారం రాప్తాడులో వైసీపీ కన్వీనర్ జూటూరు శేఖర్, యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్తిరెడ్డి, అనంతపురం రూరల్ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, జెడ్పీటీసీ జూటూరు చంద్ర కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న ఐదేళ్లూ ఏ మూల దాక్కున్నావని ప్రశ్నించారు. వైసీపీ అధికారం చేప్పట్టిన నాలుగేళ్ళలో సీఎం వైస్ జగన్ సారథ్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి రాప్తాడు అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు. పరిటాల కుటుంబాన్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా సిగ్గులేదన్నారు. ముందు మీ కుటుంబం ధర్మవరమా, రాప్తాడా అని తేల్చుకోవాలని హితవు పలికారు. ప్రజల్లో ప్రాభవం కోల్పోవడంతో ఉనికి చాటుకునేందుకు మళ్లీ ప్రజల్లోకి వస్తున్న విషయం అందరికీ తెలుసన్నారు. తోపుదుర్తి కుటుంబంపై మరొక్కమారు విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కార్యక్రమంలో అగ్రిబోర్డు ఛైర్మన్ కేశవరెడ్డి, ఎంపీటీసీ రాముడు, వెంకటనారాయణ, మరూరు చెన్నారెడ్డి, సింగారప్ప, రూరల్ నాయకుడు గుజ్జల ఈశ్వరయ్య, మాజీ వైస్ ఎంపీపీ పరందామ, రామనేపల్లి రామకృష్ణ, నాగరాజు, గవ్వల నల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img