Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆర్డిటి సహకారంతో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం

ప్రిన్సిపల్ ఏన్. మమత

విశాలాంధ్ర -ఉరవకొండ : ఆర్ డి టి సంస్థ సహకారంతో ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరు లక్షల రూపాయల వ్యయంతో విద్యార్థులకు శుద్ధ జలాన్ని అందించే సౌకర్యం కల్పించడం హర్షనీయమని కళాశాల ప్రిన్సిపల్ ఏన్. మమత అన్నారు.శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్డిటి సంస్థ రీజనల్ డైరెక్టర్ కృష్ణారెడ్డి తో పాటు ఆమె నీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య అభివృద్ధి కోసం ఆర్డిటి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. రీజనల్ డైరెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మినరల్ వాటర్నే తాగాలని వారి విద్యాభివృద్ధి,భవిష్యత్తు బాగుండాలనిదే తమ సంస్థ ధ్యేయమన్నారు తాగునీటి సమస్యను పరిష్కరించడంతో ఆర్ డి టి సంస్థకు విద్యార్థులు అధ్యాపక బృందం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిటి టీం లీడర్ నల్లపరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, అధ్యాపకులు ఆర్డిటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img