Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కురుబ సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా వశికేరి రమేష్

విశాలాంధ్ర /ఉరవకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ,(కురువ, కురమ,)సంఘం యూత్ అధ్యక్షులుగా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన వశికేరి రమేష్ ఎంపికయ్యారు. మదనపల్లిలో జరిగిన రాష్ట్ర కురుబ సంఘం సమావేశం లో రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు రమేష్ ను రాష్ట్ర యువత అధ్యక్షులుగా ఎంపిక చేసినట్లు శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా ఎన్నిక కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కురుబ కులస్తుల హక్కుల కోసం వారి యొక్క సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రమేష్ యూత్ అధ్యక్షులుగా ఎంపిక కావడంతో కురుబ సంఘం నాయకులే కాకుండా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ 15వ వార్డు సభ్యులు వశికేరి మల్లికార్జున,, రాష్ట్ర కురబ సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img