Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గృహ సారధులకు సచివాలయ కన్వీనర్లకు శిక్షణ కార్యక్రమం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ మండల సచివాలయ కన్వీనర్లు మరియు గృహసారథుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం అమ్మవారి పల్లి గ్రామం నందు జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు శంకర్ నారాయణ మరియు స్థానిక నాయకులు పాల్గొని అమ్మవారి పల్లి గ్రామం నందు ఎర్రమంచి, వెంకటగిరి పాలెం, మునిమడుగు, దుద్దె బండ మరియు గుట్టూరు సచివాలయ కన్వీనర్లు మరియు గృహసారథుల శిక్షణ కార్యక్రమం లో పాల్గొని, దిశానిర్దేశం చేసిన అనంతరం పెనుకొండ పట్టణము నందు ఎమ్మెల్యే కార్యాలయంలో నగర పంచాయతీ గృహసారథులు మరియు సచివాలయ కన్వీనర్లు శిక్షణ కార్యక్రమం జరిగింది రాబోయే ఎన్నికలలో గృహసారథులు సచివాలయ కన్వీనర్ల యొక్క పనితీరు కొలమానంగా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ వారు లబ్ధి పొందిన విధానాన్ని తెలియజేస్తూ ప్రజల వద్దకు ప్రభుత్వము చేస్తున్న పథకాల గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బాబుల్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img