Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

టీటీడీ కు గోనుగుంట్ల నితిన్ సాయి విరాళం

విశాలాంధ్ర- ధర్మవరం : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న పలు సంస్థలకు నితిన్ సాయి గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తనయుడు గోనుగుంట్ల నితిన్ సాయి గురువారం తిరుమలలో 60 లక్షలు విలువచేసే చెక్కులను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా తిరుమలలో ఉదయం నితిన్ సాయి శ్రీవారిని దర్శించుకుని టీటీడీ డొనేషనల్ సెల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సెల్వం కు ఆ డిడి లను అందజేశారు. ఈ సందర్భంగా నితిన్ సాయి మాట్లాడుతూ ఈ విరాళంలో అన్న ప్రసాదం కొరకు 10 లక్షలు, గో సంరక్షణ ట్రస్ట్ కొరకు పది లక్షలు, అనాధ పిల్లల సంరక్షణకు పదిరక్షలు, బర్డ్స్ హాస్పిటల్కు 10 లక్షలు, హిందూ దేవాలయాల పునరుద్ధరణకు పది లక్షలు, తిరుమల కాటేజీల నిర్మాణానికి 10 లక్షలు గా అందజేయడం జరిగిందన్నారు. గోనుగుంట్ల నితిన్ సాయి తన దాతృత్వాన్ని చాటుకోవడం పట్ల టిటిడి అధికారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేయించి, పూజలను నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img