Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా..

ధర్మవరం నియోజకవర్గం టిడిపి వాల్మీకి సాధికార కమిటీ ఉపాధ్యక్షులు టైలర్ గోపాల్
విశాలాంధ్ర- ధర్మవరం : నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ధర్మవరం నియోజకవర్గ టిడిపి వాల్మీకి సాధికార కమిటీ ఉపాధ్యక్షులు టైలర్ గోపాల్ తెలిపారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో బుధవారం ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో ధర్మవరం నియోజకవర్గం వాల్మీకి సాధికార కమిటీ నూతన కార్యవర్గాన్ని పరిటాల శ్రీరామ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గ వాల్మీకి సాధికార కమిటీ ఉపాధ్యక్షులుగా 26వ వార్డుకు చెందిన టైలర్ గోపాల్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసే వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, తనపై ఎంతో నమ్మకంతో ధర్మవరం నియోజకవర్గం వాల్మీకి సాధికార కమిటీ ఉపాధ్యక్షులుగా ఎంపిక చేసిన పరిటాల శ్రీరామ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేయడంతో పాటు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర విజయవంతానికి తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img