Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నారా లోకేష్ కు ఎమ్మెల్యే శంకర్నారాయణ సవాల్

విశాలాంధ్ర -పెనుకొండ : ఎమ్మెల్యే కార్యాలయం నందు మంగళవారం మహాత్మారావు జ్యోతి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే శంకర్ నారాయణ మరియు వైసీపీ నాయకులు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,పెనుకొండ నియోజకవర్గానికి మీ పార్టీ తరుపున కమ్మ సవితమ్మకు కాకుండా మా బిసి వర్గాలకు చెందిన నాయకుడికి టికెట్ ఇవ్వాలీ బిసి వర్గానికి టికేట్ ఇచ్చే దమ్ముందా లోకేష్ బిసి వర్గాలకు న్యాయం చేసింది,చేసేది మా వైసిపి పార్టీనే,మీ తాత కు వెన్నుపోటు పోడిచి తేదేపా పార్టీనే కబ్జా చేసిన ఘనత మీ నాన్నది,బిసిలకు టికెట్లు ఇచ్చి న్యాయం చేసి అప్పుడు మాట్లాడు లోకేష్ తేదేపాలో ఉన్న బిసి సొదరులారా మీ సీట్ల కోసం పోరాడండి,బిసి కులాలను అభివృధ్ధి చేయడానికి కృషీ చేయండి అంటు పిలుపునిచ్చారు లోకేష్ పాదయాత్రలో నియోజకవర్గ కేంద్రాలలో జరిగిన సమావేశాలలో ఓసి అభ్యర్థుల పోటీ చేసే నియోజకవర్గాల గురించి వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ప్రజలకు సూచించి దీవించాలని అభ్యర్థి తరఫున ప్రజల నిలబడాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఎక్కడ బీసీలకు ఎస్సీలకు టికెట్లు ఇస్తామని కానీ మీరు పనులు చేసుకోపోండి అని ఆ భరోసా కానీ లోకేష్ ఇవ్వడం లేదు అంటే మీకు బీసీలు ఎస్సీ ఎస్టీలు ల మీద గౌరవం లేదా ఓసీల మీద మాత్రమే ప్రత్యేక గౌరవాన్ని చూపిస్తూ మీ పాదయాత్ర కొనసాగుతోంది మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి మొదట ప్రాధాన్యత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే పెద్ద పీట వేస్తున్నారని కావున మీరు అటువంటి అజెండాతోలో పాదయాత్ర సాగడం లేదని లోకేష్ పై మండిపడ్డారు పార్టీపై పట్టు లేకుండా పాదయాత్ర ఎందుకు చేస్తావు బాబు ప్రశాంతంగా ఇంట్లో ఉండక పార్టీ మీద పట్టు ఉండాలి సమస్యల మీద పట్టు ఉండాలి అవగాహన ఉండాలి అప్పుడే ప్రజల్లోకి రావాలి నీకు ఎటువంటి అవగాహన లేకుండా ప్రజలలో తిరగడం మీ యొక్క అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఆయన లోకేష్ పై మండిపడ్డారు పెనుకొండ నియోజకవర్గానికి బీసీ వర్గానికి టికెట్ ఇస్తారా కమ్మ వర్గానికి టికెట్ ఇస్తారా కమ్మ సామాజిక వర్గానికి చెందిన సవితమ్మ నేనే అభ్యర్థిని చెప్పుకుంటున్నది కావున మీరు అభ్యర్థిని ప్రకటించలేక మీరు సవితమను అభ్యర్థిగా ప్రకటిస్తే బీసీల దూరం అవుతారు అనే ఉద్దేశంతో వాయిదాలు వేస్తూ ఉన్నారు కావున ఇప్పటికైనా మించింది లేదు మీరు జిల్లా దాటే లోపల పెనుకొండ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించాలని ఇక్కడ బీసీలకు ఇస్తారా ఓసీలకు ఇస్తారా అనే సంక్షిప్తంలో ప్రజలు ఉన్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img