విశాలాంధ్ర` కళ్యాణదుర్గం : ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాడి అమరుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి గురువారం కళ్యాణదుర్గంలో ఘనంగా జరిగాయి. స్థానిక గాంధీ చౌక్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అన్నదానం నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఆర్యవైశ్య సంఘం , ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు జయం విశ్వనాథ్, గోపీనాథ్ , శ్రీనివాసులు, రంజిత్ తదితరులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.