జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని షెడ్యూల్ తేదీలు ప్రకారం సేవ్ ధర్మవరం కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ కార్యక్రమంలో వార్డు ప్రజల సమస్యలను అడిగి పరిష్కరించుట మా లక్ష్యమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని 25, 26 వార్డులలో వారు సేవ్ ధర్మవరం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ వార్డుల్లో ముఖ్యంగా భవన కార్మికులు, మైనారిటీ సోదరుల యొక్క కష్టాలను వారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నేడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వములో జరుగుతున్న దోపిడీలు, దౌర్జన్యాలను గురించి కూడా వా ప్రజలు చిలకం దృష్టికి తీసుకొని వచ్చారు. స్పందించిన చిలక మధుసూదన్ రెడ్డి మా జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ధర్మవరంలో ఎలాంటి దౌర్జన్యాలు రౌడీయిజాలు లేకుండా చేస్తామని, ఆ బాధ్యతను తానే వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వందలాదిమంది పాల్గొన్నారు.