Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రజా సమస్యలు పరిష్కరించుట ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ముఖ్య లక్ష్యం.. ఆర్డిఓ తిప్పే నాయక్

విశాలాంధ్ర- ధర్మవరం : ప్రజా సమస్యలను పరిష్కరించుటయే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ముఖ్య లక్ష్యం అని ఆడియో తిప్పే నాయక్, తాసిల్దార్ యూగేశ్వరి దేవి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాలలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆర్డీవో కార్యాలయంలో తిప్పే నాయక్, తహసిల్దార్ కార్యాలయంలో యు గేశ్వరి దేవి, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మల్లికార్జున, మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, దేశ నాయకులు దేశ స్వాతంత్రం కోసం నిరంతర పోరాటాలు చేసి, తమ ప్రాణాలను త్యాగం చేయడం వల్లనే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు. తదుపరి ఉద్యోగస్తులు అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో కతి జూన్ కుప్రా, లక్ష్మీదేవి, అంపయ్య, డిప్యూటీ ఎమ్మార్వో ఈశ్వరయ్య, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img