Friday, April 26, 2024
Friday, April 26, 2024

బురదమయంగా మారిన పాఠశాలకు వెళ్లే రహదారి

విశాలాంధ్ర` ఉరవకొండ : ఉరవకొండ పట్టణ సమీపంలోని శివరామిరెడ్డి కాలనీలో ఉన్న అంబేద్కర్‌ బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లే రహదారి బురదమయంగా మారింది. దీనివల్ల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పాఠశాలకు నిత్యవసర సరుకులు తీసుకెళ్లే ఆటో కూడా వెళ్లలేక పోవడం వల్ల సరుకులను పాఠశాలకు మోసుకెళ్లే పరిస్థితి నెలకొన్నది మంగళవారం నిత్యవసర సరుకులతో వెళుతున్న ఆటో బురదలో కూరకపోవడంతో అక్కడ నుంచి సరుకులను పాఠశాలకు మోసుకెళ్లారు. ఈ రహదారిని మరమ్మత్తు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాల కమిటీ చైర్మన్‌ మరియు సభ్యులు అనేకసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేకపోయింది వర్షం వచ్చిన ప్రతిసారి కూడా తమకు ఈ కష్టాలు తప్పడం లేదని గురుకుల పాఠశాల సిబ్బంది తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే రోడ్డును నిర్మించాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img