Friday, April 26, 2024
Friday, April 26, 2024

మా భవిష్యత్తు నువ్వే జగనన్న కార్యక్రమం

విశాలాంధ్ర -పెనుకొండ : మా భవిష్యత్తు నువ్వే జగనన్న కార్యక్రమాన్ని బుధవారం మండల పరిధిలోని మావటూరు సచివాలయ పరిధిలో గల మావటూరు గ్రామము యందు వైయస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర ఉప్పర సగర రాష్ట్ర డైరెక్టర్ నరసింహప్ప సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన స్టిక్కర్లు మరియు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్నే మా భవిష్యత్ః అనే నినాదంతో ప్రజలతో మమేకం అవ్వడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు, గత ప్రభుత్వాలకు- జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. నవరత్నాలు పథకాలు ద్వారా అర్హులైన పేదలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్ కే దక్కింద నీ అన్నారు. ప్రజలందరూ కూడా జగన్ ఆశీర్వదించాలని వారు ప్రజలను అభ్యర్థించారు అలాగే లబ్ధిదారుల ఫోన్ నుంచి వైఎస్ఆర్సిపి రూపొందించిన ఫోన్ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇప్పించారు,ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ ,మరియు జయప్ప, మరియు గృహసారథులు వెంకటరామిరెడ్డి, నాగరాజు, కొండన్న, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నరసింహప్ప, మరియు వైసిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img