Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విన్నుత పద్ధతిలో చలివేంద్రం ఏర్పాటు

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ కోర్టు ప్రాంగణము నందు శుక్రవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూనియర్ సివిల్ జడ్జి ముజీబ్ పసల మరియు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు నాగరాజు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ చలివేంద్రాన్ని విన్నుత పద్ధతిలో జుగాడ్ సిస్టం ద్వారా ఏర్పాటు చేశారు వాటర్ క్యాన్లకు నీటితో తడిపిన సంచి,పట్ట,చుట్టి ఏర్పాటు చేయడం వలన అవి గాలికి పూర్తిగా చల్లదనం ఏర్పడుతుందని ఈ వేసవిని దృష్టిలో ఉంచుకొని కక్షి దారులు న్యాయవాదులు సిబ్బంది మంచినీటి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఆర్వో వాటర్ ఏర్పాటు చేయడం వలన కోర్టు పని మీద వచ్చే వారికి చాలా చక్కటి అవకాశమని త్రాగునీటిని ఏర్పాటు చేయడం వలన ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించామని నాగరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జాయింట్ సెక్రెటరీ విక్రాంతనాయక్, నాగిరెడ్డి, జావిద్ , మోహన్ నాయక్ ,శ్రీనివాసులు లక్ష్మీనారాయణ ,దయానంద రెడ్డి, కోమలి ,హరీష్ ,మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img