విశాలాంధ్ర/ ధర్మవరం: పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా సబ్ జూనియర్ బాలుర హాకీజెట్ల ఎంపిక కార్యక్రమం ఘనంగా మంగళవారం నిర్వహించుకున్నారు. ముఖ్య అతిథులుగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు బంధనాదం సూర్యప్రకాష్, సీనియర్ హాకీ క్రీడాకారులు చంద్రశేఖర్, అరవింద్ గౌడ్లు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 28 నుండి 31వ వరకు వైజాగ్ లో నిర్వహించే సబ్ జూనియర్ హాకీ పోటీలలో పాల్గొనే జట్టును ఎంపిక చేయడం జరిగిందన్నారు. జట్టు సభ్యులుగా నవీన్, మహబూబ్ బాషా, పవన్ కుమార్, దుర్గాప్రసాద్, అఖిల్ కుమార్ రెడ్డి, అభిషేక్, సాయి నంద, రవి, వెంకట అభిషిత్, వంశీ, మహమ్మద్ ఆరసిన్, శబరీష్ గౌడ్, భరద్వాజ్, మనోజ్, సంతోష్, ఆనంద్, శశాంక్, లోకేష్ తదితరులు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ జట్టుకు మేనేజర్ గా అరవింద్ గౌడ్ కోర్టుగా సాయి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన వారందరికీ కూడా అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.