Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

సంక్షేమ ప్రభుత్వానికి పేద ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం:: సంక్షేమ ప్రభుత్వానికి పేద ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పట్టణంలోని 9, 34వ వార్డుల నుండి 419 కుటుంబాలు టిడిపి నుండి వైఎస్సార్సీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు పాటు నవరత్నాల పథకాలతో పేద ప్రజలకు అందించిన సంక్షేమముతో నాడు పేద ప్రజలు ఎంతో తృప్తిని పొందుతున్నారని తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పేద ప్రజలే స్టార్ క్యాంపనర్లుగా నిలిచి అఖండ విజయాన్ని అందిస్తారని తెలిపారు. తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ మాసపల్లి సాయికుమార్ ఆధ్వర్యంలో 34వ వార్డు ఇన్చార్జి బాలన్ గోపాల్ కౌన్సిలర్ బాలమ్మ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఇందుకు వారందరినీ కూడా అభినందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రములో విప్లవాత్మక మార్పులు తేవడం జరిగిందని నాడు నేడు ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ కు దీటుగా అభివృద్ధి చేసి, జగనన్న విద్యా వసతి దీవెనల ద్వారా ఉన్నత చదువులను పేదలకు అందుబాటులోకి తేవడం జరిగిందని తెలిపారు. నేతన్న నేస్త ద్వారా ఐదు సంవత్సరాలలో ఒక్కొక్క కుటుంబానికి 1, 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగిందన్నారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు మాకు ఎంతగానో నచ్చడం వల్లనే తాము పార్టీలోకి చేరడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img