Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

గుర్తు తెలియని వ్యక్తి పట్టాల పక్కన పడి మృతి

విశాలాంధ్ర – ధర్మవరం : మండల పరిధిలోని రైల్వే విభాగానికి సంబంధించి పుట్టపర్తి- బసంపల్లి మధ్యన 50 సంవత్సరాలు లోపు వయసుగల ఒక మగ వ్యక్తి మృతి చెందడం జరిగిందని హిందూపురం జిఆర్పి ఎస్ ఐ బాలాజీ నాయక్ తెలిపారు. వివరాలకు వెళితే రాబడిన సమాచారం మేరకు బసంపల్లి నిమ్మలకుంట గ్రామ సమీపానగల రైల్వే పట్టాల ప్రక్కన మృతి చెందాడన్న విషయాన్ని హిందూపూర్ జిఆర్పి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. దీంతో ఎస్ఐ బాలాజీ నాయక్ తో పాటు కానిస్టేబుల్ కృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని మృతిని వివరాలపై ఆరా తీశా రు. మృతి చెందిన మృతదేహం భరించరాని వాసన రావడంతో, వీఆర్వో రామకృష్ణ ద్వారా కేసును నమోదు చేస్తున్నట్లు వారు తెలిపారు. అసలు ఈ వ్యక్తి రైలు నుంచి జారిపడ్డాడా? లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో హిందూపూర్ జిఆర్పి పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతదేహం బాగా కుళ్ళిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని వారు తెలిపారు. అనంతరం అతి కష్టం మీద శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తదుపరి కేసు నమోదు చేసుకుని మగ వ్యక్తి యొక్క వివరాలపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img