విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ : జెఎన్టియుఏ ఇంజనీరింగ్ కళాశాలలోని(అనంతపురం) ఈ ఈ ఈ విభాగధిపతిగా యం. రామ శేఖర రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపకులపతి ఆచార్య జింక రంగా జనార్ధన్, రెక్టర్ ఆచార్య విజయ్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ నాకు ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి విశ్వవిద్యాల కీర్తిని ఇనుమడింప చేస్తానని అన్నారు. అనంతరం రిజిస్ట్రార్ విభాగ అధిపతికి, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ అరుణ క్రాంతి, డైరెక్టర్లు, బోధన, బోధనతర సిబ్బంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అభినందనలు తెలిపారు.