Friday, April 26, 2024
Friday, April 26, 2024

కన్నుల పండుగగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మరథోత్సవం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 117 వ కళ్యాణబ్రహ్మ రథోత్సవాలు కన్నుల పండుగగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలను వెచ్చం అమర్‌ నాథ్‌ వారి కుమారులు సుమన్‌, డాక్టర్‌ రత్నాకర్‌, డాక్టర్‌ పవన్‌ కుమార్‌ లు గురువారం వేద పండితులు మరియు ధర్మకర్త మండలి సభ్యులు స్వామివారిని మడుగుతేరు మరియు బ్రహ్మ రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టణ లోని ప్రజలు మరియు ఇతర ప్రాంతాల నుంచి అనేకమంది విచ్చేశారు అలాగే అనేక పూజాది కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణాచార్యులు నిర్వహించారు స్వామివారిని పురవీధుల గుండా ఊరేగించారు భక్తులందరూ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతూ పరవశం అయ్యారు. ఈ కార్యక్రమంలో యాడికి నాగరాజు, ప్రగతి శ్రీనివాసులు, కన్నా స్వామి, ఇతర పురోహితులు ధర్మకర్త మండలి సభ్యులు పాల్గొన్నారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img