Friday, April 26, 2024
Friday, April 26, 2024

పశువులకు లంపి వైరస్ నివారణకు సూది మందులు అందజేయాలి

ఆత్మకూరు సిపిఐ మండల కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర – అనంతపురం : మండల వ్యాప్తంగా విస్తరిస్తున్న లంపి వైరస్ ను అరికట్టాలని సిపిఐ మండల కార్యదర్శి రామకృష్ణ కోరారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పశువులకు లంపి వైరస్ సూది మందు అందజేయాలని సిపిఐ నాయకులు సోమవారం పశువైద్యాధికారి తులసి రామ్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పశువుల చర్మానికి మచ్చులు ( లంపి వైరస్ )
బారినపడి మృతి చెందాయని అని పేర్కొన్నారు. లక్షల రూపాయలు విలువ చేసే పశువులు మృతి చెందుతున్నాయని అన్నారు. జాగ్రత్తలు తీసుకొని పాడి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండారు శివ, ముత్యాలన్న,నరసింహులు, స రోజమ్మ, చిన్న ముత్యాలన్న,గోపాల్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img