Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక

ధర్మంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సెట్టిపీ జయచంద్ర రెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం – రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టుకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక కావడం జరిగిందని ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఏప్రిల్ 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో జరిగే తొమ్మిదవ జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటారని తెలిపారు. బాస్కెట్బాల్ ఎంపికైన వారిలో నిఖ్య , సల్మా, కిరణ్మయి అనే ముగ్గురు బాలికలు అలాగే బాలుర విభాగంలో తరుణ్ అని, మొత్తం మీద ధర్మారం పట్టణానికి చెందిన నలుగురు బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు. వీరి ఎంపిక పట్ల జయచంద్ర రెడ్డి తో పాటు అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదాయత్తుల్ల,కోచ్ సంజయ్ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img