ఆర్డిటి. ఏఎఫ్.ఎకాలజీ
విశాలాంధ్ర – ధర్మవరం : మండల పరిధిలోని బడన్నపల్లి గ్రామములో గల మండల సస్య మిత్ర సమైక్య లీడర్ ఆధ్వర్యంలో బుధవారం ఏడీఏ కృష్ణయ్య చేతుల మీదుగా మిశ్రమ ఆహార పంటల విత్తన పంపిణీ నిర్వహించడం జరిగిందని మండల టీం లీడర్ రమేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలం మొత్తం ఏఎఫ్ ఎకాలజీ ఆధ్వర్యంలో ఉన్న సస్యమిత్ర గ్రూపులకు, గ్రూపులో ఉన్న రైతులకు పెసర, కోర్ర,అలసంద, సజ్జ, జోన్న, ఊద్దులు, కందులు విత్తనాలను ఇవ్వడం జరిగిందన్నారు. మండల పరిధిలోని 1500 మంది కు ఈ చిరుధాన్యాలు, పప్పు దినుసులు, రకాల విత్తన పంపిణీ చేశామని తెలిపారు. అదేవిధంగా ఏ డి ఏ కృష్ణయ్య ఏవో చిన్న వీరస్వామి మాట్లాడుతూ మన ప్రభుత్వం తరఫున కూడా రైతులకు క్రాఫ్ ఇన్సూరెన్స్ కోసము ఈ పంటలను క్రాప్ బుకింగ్ చేసుకోవాలని, రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విహెచ్ఎ కమ్మన్న, ఎస్ టి ఓ శ్రీనివాసులు, సీఈవో మహేంద్రా, మండల కన్వీనర్ సరోజమ్మ, మహిళలు ప్రమీల, ఎర్రమ్మ, రాధ,ఇందిరా ఇతర రైతులు ధర్మవరం వారు పాల్గొనడం జరిగింది.